వార్తలకు తిరిగి వెళ్లండి
పౌరసరఫరాల శాఖలో ప్రత్యేక నిఘా బృందం

ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం 12 మంది అధికారులతో ప్రత్యేక విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బృందం రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, గ్యాస్ పంపిణీ సహా పలు విభాగాల్లో తనిఖీలు చేపడుతుంది.
రేషన్ షాపులు, రైస్ మిల్లులు, గోదాములు మరియు పాఠశాలల్లోని పథకాల అమలులో అవకతవకలపై ఈ కమిటీ ఆకస్మిక దాడులు నిర్వహిస్తుంది. అక్రమాలను గుర్తించి నేరుగా కమిషనర్కు నివేదికలు అందజేస్తుంది.
Comments
Loading comments...