వార్తలకు తిరిగి వెళ్లండి
మట్టి మాఫియా.. చెరువుల దోపిడీ

ములకలపల్లి మండలం పాతూరు చింతలచెరువులో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తోలకాలు సాగుతున్నాయి. కొందరు జేసీబీలతో లోతుగా తవ్వుతూ అనుమతి కంటే ఎక్కువ మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
రాత్రి వేళల్లో అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారి బురదమయంగా మారి వాహనదారులు ఇబ్బంది పడుతుండటంతో తక్షణ చర్యలు కోరుతున్నారు.
Comments
Loading comments...