Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి మాఫియా.. చెరువుల దోపిడీ

వైష్ణవి శర్మ Jul 19, 2026 1:10 PM భద్రాద్రి కొత్తగూడెంabout 11 hours ago
మట్టి మాఫియా.. చెరువుల దోపిడీ - Udayam Digital
ములకలపల్లి మండలం పాతూరు చింతలచెరువులో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తోలకాలు సాగుతున్నాయి. కొందరు జేసీబీలతో లోతుగా తవ్వుతూ అనుమతి కంటే ఎక్కువ మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారి బురదమయంగా మారి వాహనదారులు ఇబ్బంది పడుతుండటంతో తక్షణ చర్యలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...