వార్తలకు తిరిగి వెళ్లండి
నగరంలో ఎండలు: కనుమరుగైన వానలు

జూలై నెలలో కురవాల్సిన రుతుపవన వర్షాలు కనుమరుగవడంతో మహానగరంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతం కావాల్సింది పోయి, భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు.
గడచిన రెండు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
Comments
Loading comments...