Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క మరణం... నలుగురు అధికారులపై వేటు

కిరణ్ కుమార్ Jul 02, 2026 12:07 PM అల్ ఇండియా 4 viewsabout 3 hours ago
ఒక్క మరణం... నలుగురు అధికారులపై వేటు - Udayam Digital
ముంబైలోని సాకినాకా ప్రాంతంలో అస్లామ్ షేక్ అనే వ్యక్తి తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి మరణించిన దురదృష్టకర ఘటనపై నగర మేయర్ రీతూ తావ్డే తీవ్రంగా స్పందించారు. రెండేళ్ల క్రితమే కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ, వర్షాల సమయంలో రక్షణ కవచాలు ఏర్పాటు చేయడంలో యంత్రాంగం వైఫల్యాన్ని ఆమె తప్పుబట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వార్డ్ ఆఫీసర్, ఏఈ, సబ్ ఇంజనీర్, జేఈలను తక్షణమే సస్పెండ్ చేశారు. అలాగే బాధితుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.

Comments

G
Loading comments...