వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం గోరంటాల లో సీఎం సహాయ నిధి ద్వారా రూ.79 వేలు విలువచేసే ఐదు చెక్కులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బుచ్చ గారి అంజాగౌడ్ శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయనిది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

