వార్తలకు తిరిగి వెళ్లండి

ఖోఖోలో జాతీయ స్థాయిలో రాణిస్తూ కల్వకుర్తి ఎంజేపీ బాలికల గురుకుల విద్యార్థిని మంగలి శ్రీలక్ష్మి పతకాలు సాధిస్తోంది. పదో తరగతి చదువుతున్న ఆమె ఎనిమిది సార్లు జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరిచింది.
2025లో జాతీయ జూనియర్ పోటీల్లో కాంస్యం సాధించిన శ్రీలక్ష్మి, ఖేలో ఇండియా పోటీల్లో మూడో స్థానంలో నిలిచింది. ఆమె ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వం 2024-25 రాష్ట్రస్థాయి పురస్కారం అందించింది.
Comments
Loading comments...

