వార్తలకు తిరిగి వెళ్లండి
ఎంపీలకు షాక్: పార్లమెంట్లో కొత్త ఆంక్షలు

ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్సభ సచివాలయం ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సభా భద్రత, సభ్యుల గోప్యత దృష్ట్యా స్మార్ట్ వాచీలు, పెన్ కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం విధించింది.
రహస్యంగా వీడియోలు తీసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.
Comments
Loading comments...