వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండోనేషియా ఓపెన్ తొలి రౌండ్లోనే భారత స్టార్ షట్లర్లు సాత్విక్సాయిరాజ్-చిరాగ్ శెట్టి టోర్నీ నుండి తప్పుకున్నారు. మలేషియా జంటతో మ్యాచ్ జరుగుతుండగా సాత్విక్ కుడి భుజం గాయంతో ఇబ్బంది పడటంతో ఆటను మధ్యలోనే ఆపేశారు.
ఇటీవలే థాయ్లాండ్, సింగపూర్ ఓపెన్ టోర్నీలలో వరుసగా ఆడటంతో సాత్విక్ భుజంపై ఒత్తిడి పడిందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలిపింది. రాబోయే పెద్ద టోర్నమెంట్ల దృష్ట్యా సాత్విక్ రికవరీపైనే ప్రస్తుతం బృందం దృష్టి పెట్టనుంది.
Comments
Loading comments...

