వార్తలకు తిరిగి వెళ్లండి
సర్దార్నగర్ అడవికి రిజర్వ్ ఫారెస్ట్ హోదా

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని మంకాల్ గ్రామంలో 280 ఎకరాల భూమిని 'సర్దార్నగర్ రిజర్వ్ ఫారెస్ట్'గా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 25 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనకు తాజాగా మోక్షం లభించింది.
ఈ ప్రాంతాన్ని అక్రమ ఆక్రమణల నుండి రక్షించడానికి మరియు పర్యావరణ పరిరక్షణకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు తెలిపారు. సెక్షన్ 4 నోటిఫికేషన్తో ఈ భూమికి చట్టపరమైన రక్షణ లభించింది.
Comments
Loading comments...