Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుశస్థలి నదిలో ఇసుక దందా

వినయ్ కుమార్ Jul 11, 2026 7:11 AM చిత్తూరు 4 viewsabout 1 hour ago
కుశస్థలి నదిలో ఇసుక దందా - Udayam Digital
చిత్తూరు జిల్లా నగరి, విజయపురం మండలాల సరిహద్దులోని కుశస్థలి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అక్రమార్కులు పగటిపూట ఇసుకను పట్టణాల్లో నిల్వ చేసి, రాత్రికి రాత్రే టిప్పర్ల ద్వారా తమిళనాడుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాజకీయ బలంతో అధికారుల కళ్లెదుటే ఈ అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...