వార్తలకు తిరిగి వెళ్లండి
ఇసుక మాఫియా బెదిరింపులు
Harika Jun 20, 2026 8:28 AM నారాయణపేట 9 viewsabout 3 hours ago

అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించినందుకు మాఫియా తమను బెదిరిస్తోందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు అధికారుల అండతోనే కృష్ణానది నుంచి భారీగా ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారని వారు ఆరోపించారు.
ప్రశ్నిస్తున్న వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని నాయకులు మండిపడ్డారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాలని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని వారు జిల్లా ఎస్పీని కోరారు.
Comments
Loading comments...