వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్చెరు మండలం భానూరు గ్రామంలోని లహరి జెడ్లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడి లడ్డూ వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన చర్లగూడెం సురేందర్ రెడ్డి రూ.1,46,000లకు లడ్డూను దక్కించుకున్నారు.
గత 20 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇంత పెద్ద మొత్తంలో వేలం జరగడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని సురేందర్ రెడ్డి ఆకాంక్షించారు.
Comments
Loading comments...

