వార్తలకు తిరిగి వెళ్లండి
బైక్పై భారత్ను చుడుతున్న రష్యా యువతి

భారత ప్రకృతి అందాలు, సంప్రదాయాలకు ఫిదా అయిన రష్యా యువతి మనీషా బైక్పై దేశాన్ని చుట్టేస్తున్నారు. జూన్ 4న గోవా నుంచి మూడో పర్యటన ప్రారంభించిన ఆమె, బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు చేరుకున్నారు.
నాలుగు నెలల పాటు రోజుకు 200 కిలోమీటర్ల చొప్పున మొత్తం 22 వేల కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాత్రి వేళల్లో పెట్రోల్ బంకుల వద్ద విశ్రమిస్తూ పర్యటన సాగిస్తున్నారు.
Comments
Loading comments...