వార్తలకు తిరిగి వెళ్లండి
తృటిలో తప్పిన ఆర్టీసీ బస్సు ప్రమాదం

భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు యాక్సిల్ విరిగి టైరు ఊడిపోవడంతో వైరా వద్ద ప్రమాదానికి గురైంది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే నిలిపివేయడంతో 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించగా, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రాకపోకలను పునరుద్ధరించారు.
Comments
Loading comments...