వార్తలకు తిరిగి వెళ్లండి
ములుగు అడవుల్లో రాతి యుగం నాటి చిత్రాలు

ములుగు జిల్లా వెంకటాపూర్ మండల అడవుల్లోని గుట్టలపై రాతి యుగం నాటి చిత్రాలను ‘ప్రీహా’ బృందం గుర్తించింది. మొద్దుగుట్ట, దర్వాజల గుట్ట, నెమలి గుట్టల్లోని బండరాళ్లపై ఎరుపు, తెలుపు రంగుల్లో మానవాకృతులతో పాటు వివిధ జంతువుల చిత్రాలు లభ్యమయ్యాయి.
ఈ ప్రాచీన చిత్రాలను చరిత్రకారులు ఎం.ఎ.శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం వెలుగులోకి తెచ్చింది. ఇవి ఆ ప్రాంత చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...