వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
బీహార్లో 3,035 మంది నకిలీ టీచర్ల బర్తరఫ్.

బీహార్ ప్రభుత్వ పాఠశాలల్లో నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన 3,035 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ విధుల నుంచి తొలగించింది. 2005-2015 మధ్య కాలంలో జరిగిన ఉపాధ్యాయ నియామకాలపై విజిలెన్స్ బ్యూరో జరిపిన భారీ దర్యాప్తులో ఈ మోసం బయటపడింది.
ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు 1,830 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నిందితుల నుంచి ఇప్పటివరకు చెల్లించిన జీతాల మొత్తాన్ని వడ్డీతో సహా రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Loading comments...