వార్తలకు తిరిగి వెళ్లండి
విమాన ప్రయాణికులకు ఊరట

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో, దేశీయంగా విమాన ఇంధనం (ATF) ధరను లీటరుకు రూ. 5 మేర తగ్గిస్తూ చమురు సంస్థలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి.
ఈ తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ. 110 కి చేరింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా రికార్డు స్థాయికి చేరిన విమాన ఇంధన ధరలు, ఆ తర్వాత తగ్గుముఖం పట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Comments
Loading comments...