వార్తలకు తిరిగి వెళ్లండి
బకాయి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి

స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకుడు భూక్య జంపన్న డిమాండ్ చేశారు. బకాయిల వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
కళాశాలలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. బకాయిలు ఇవ్వకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...