వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని బిఆర్ఎస్ పార్టీ జన్నారం మండల నాయకులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని వ్యవసాయ అధికారి కార్యాలయంలో వ్యవసాయ అధికారి వీరన్నకు వినతి పత్రం సమర్పించారు.
భారీ వర్షాలు పడి వ్యవసాయ పనులు ముమ్మరమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన అన్ని పంట రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అధ్యక్షుడు రాజారాం రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

