వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీవారి ఆలయానికి భక్తుల భారీ విరాళం
శిరీష గౌడ్ Jun 26, 2026 12:18 PM పశ్చిమగోదావరి 7 viewsabout 2 hours ago

కాళ్లకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మాడవీధుల విస్తరణ కోసం భక్తులు రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. లచ్చిరాజు-వరలక్ష్మి దంపతులు, రేవంత్ సాయిశివవర్మ కలిసి ఈ మొత్తాన్ని దేవస్థానానికి సమర్పించినట్లు ఆలయ ఛైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో మోకా అరుణ్ కుమార్ వెల్లడించారు.
భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని ఈవో తెలిపారు. దాతల ఉదారతను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.
Comments
Loading comments...