వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారీ శనివారం కొత్తవలస సంత మార్కెట్ వద్ద నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు.
అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్తను నిర్ణీత ప్రదేశాల్లో వేయాలని సూచించారు. పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులను నివారించవచ్చన్నారు.
Comments
Loading comments...

