Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాజెక్టుల కింద వరి వద్దే వద్దు

Follow Udayam Digital on Google
మహేష్ కుమార్ Aug 08, 2026 6:24 AM హైదరాబాద్తెలంగాణ
ప్రాజెక్టుల కింద వరి వద్దే వద్దు - Udayam Digital
ఈ నెలలో కురిసిన వర్షాలతో కొంత ఉపశమనం లభించినా ప్రాజెక్టుల కింద ప్రస్తుతం వరి సాగు చేయడం సముచితం కాదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్, శ్రీరామసాగర్‌లో నీటి మట్టాలు ఆశించిన స్థాయికి చేరలేదని తెలిపారు. తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో జిల్లా నీటిపారుదల సలహా మండళ్ల సమావేశాలను శనివారం నుంచే నిర్వహించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...