వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని లయన్స్ క్లబ్ జన్నారం మండలం సభ్యులు కోరారు. వినాయక చవితిని పురస్కరించుకొని సోమవారం జన్నారం మండల కేంద్రంలో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి మేలు చేసేది మట్టి వినాయక విగ్రహాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు మారుతి రాజ్, గోలి రాము, కస్తూరి సతీష్, రామ్ సింగ్ ఉన్నారు.
Comments
Loading comments...

