వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ విద్యా సంస్థలోనే విద్యార్థులకు మంచి విద్య అందుతుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. బుధవారం రాత్రి కలెక్టర్, లక్ష్మణచాంద మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సంఖ్య, నేడు హాజరైన వారి వివరాలు, విద్యార్థులకు అందిస్తున్న భోజనం, విద్య, సౌకర్యాలపై ఆరా తీశారు.
Comments
Loading comments...

