వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధి మండలం పనసపల్లిలో మంచినీటి ట్యాంకు ఏర్పాటు చేయకపోవడంపై గిరిజనులు నిరసన చేపట్టారు. ఐదు నెలల క్రితం ట్యాంకు ఏర్పాటుకు తీర్మానం చేసినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని తెలిపారు.
ట్యాంకు లేక తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు పేర్కొన్నారు. వెంటనే ట్యాంకు నిర్మించాలని పంచాయతీ పాలకులు, అధికారులను కోరారు.
Comments
Loading comments...

