వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్టు జట్టులో చోటు నిలబెట్టుకోవాలంటే స్థిరంగా పరుగులు చేయడమే మార్గమని దేవదత్ పడిక్కల్ అన్నారు. శ్రీలంకపై వరుస సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన ఆయన మూడో స్థానంలో పోలికలను పట్టించుకోనన్నారు.
తన బ్యాటింగ్ విధానాన్ని మెరుగుపరిచేందుకు రాహుల్ ద్రవిడ్తో చర్చలు చేశానని ఆయన తెలిపారు. టెస్టుల్లో అవకాశాలు పరిమితంగా ఉంటాయని, పరుగులు చేస్తూ విజయాల్లో భాగమైతే స్థానానికి ఢోకావుండదన్నారు.
Comments
Loading comments...

