వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ఫోన్ను ఎక్కువసేపు కిందికి చూస్తూ వాడటం వల్ల మెడ నొప్పి, కీళ్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వెన్నుపూసపై అధిక భారం పడేలా చేసి మెడ కండరాలను దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపారు.
ఫోన్ను కంటి చూపు ఎత్తులో ఉంచి, చేతులకు సపోర్ట్తో వాడాలని సూచించారు. అలాగే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవడం వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుందని వివరించారు.
Comments
Loading comments...
