వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబట్ల-కొనాపూర్ దుబ్బరాజన్న దేవస్థానంలో శనివారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ పరిశీలకులు రాజమోగిలి పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో రూ.19,29,599 ఆదాయం సమకూరింది.
ఇందులో నోట్ల రూపంలో రూ.17,09,150, నాణేల రూపంలో రూ.2,20,449 లభించాయి. అలాగే 19 అమెరికా డాలర్లు, 630 యూఏఈ దిర్హమ్స్ లభించగా, బంగారం, వెండి లభించలేదని ఈఓ వి.అనూష తెలిపారు. ఆలయ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

