వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన సంఘాలు చేపట్టిన మన్యం బంద్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు వందశాతం ఉద్యోగ అవకాశాల కోసం గత జీవో-3 తరహాలో కొత్త జీవో తీసుకురావాలని సంఘాలు డిమాండ్ చేశాయి.
అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో బంద్ నిర్వహించారు. పాడేరులో ఆర్టీసీ బస్సులను అడ్డుకోగా, కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు.
Comments
Loading comments...
