Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీసీబీ కొత్త టోర్నీ ప్రకటన

సంజయ్ రెడ్డి Jul 27, 2026 9:49 PM అల్ ఇండియా క్రీడలు
పీసీబీ కొత్త టోర్నీ ప్రకటన - Udayam Digital
వన్డే ప్రపంచకప్‌–2027 సన్నాహాల్లో భాగంగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ‘నేషనల్‌ ఛాంపియన్స్‌ కప్‌–2026’ పేరుతో కొత్త టోర్నీని ప్రకటించింది. యువ, సీనియర్‌ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపింది. ఆగస్టు 11 నుంచి 18 వరకు ముల్తాన్‌ వేదికగా నాలుగు జట్ల మధ్య ఈ టోర్నీ జరగనుంది. రౌండ్‌–రాబిన్‌ విధానంలో లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించి, అగ్ర రెండు జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి.

Comments

G
Loading comments...