వార్తలకు తిరిగి వెళ్లండి
ఊట్కూర్ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన పావని
పవని రెడ్డి Jun 24, 2026 11:12 AM నారాయణపేట 2 viewsabout 13 hours ago

ఊట్కూర్ మండల నూతన ఎంపీడీవోగా పావని పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జిగా వ్యవహరించిన కిషోర్ కుమార్ నుంచి ఆమె బాధ్యతలను తీసుకున్నారు. అనంతరం కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
మండల అభివృద్ధిని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేర్చడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పావని పేర్కొన్నారు.
Comments
Loading comments...