వార్తలకు తిరిగి వెళ్లండి
వైద్యుల కొరతతో రోగుల తిప్పలు

పర్చూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్టు సెలవుపై వెళ్లడంతో గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన వైద్యం అందక రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు.
ఆసుపత్రిలో పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్ వైద్యుల ఖాళీలు కూడా దర్శనమిస్తున్నాయి. ప్రత్యామ్నాయ వైద్యులను నియమించి మెరుగైన సేవలు అందించాలని ఉన్నతాధికారులకు విన్నవించినట్లు సూపరింటెండెంట్ అరుణ్ తెలిపారు.
Comments
Loading comments...