Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jun 23, 2026 11:45 AM జాతీయంGeneral
నేడు రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానం - Udayam
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఇందులో విజయ్ అమృతరాజ్, మమ్ముట్టి, అల్కా యాగ్నిక్, రోహిత్ శర్మ సహా మొత్తం 65 మంది ప్రముఖులు అవార్డులు అందుకోనున్నారు. ఈ ఏటి పురస్కారాల్లో మొత్తం 131 అవార్డులను ప్రభుత్వం ప్రకటించగా, నేడు 2 పద్మ విభూషణ్, 7 పద్మ భూషణ్, 56 పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు.

Comments

G
Loading comments...