వార్తలకు తిరిగి వెళ్లండి
విదేశాల్లో భారత కాన్సులర్ సేవలకు బ్రేక్

ఆస్ట్రేలియా, కువైట్, యూఏఈ దేశాల్లో భారత రాయబార కార్యాలయాలు ప్రస్తుతం పరిమిత కాన్సులర్ సేవలను మాత్రమే అందిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. సేవల్లో సహకరిస్తున్న ఔట్సోర్సింగ్ సంస్థల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని, ఢిల్లీ హైకోర్టు నుండి వచ్చే తదుపరి ఆదేశాల కోసం తాము వేచి చూస్తున్నామని జైస్వాల్ స్పష్టం చేశారు. అప్పటివరకు ఈ దేశాల్లోని భారతీయులకు పరిమిత సేవలే అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
Comments
Loading comments...