వార్తలకు తిరిగి వెళ్లండి
ఒడిశాలో పాఠ్యపుస్తకాల గందరగోళం

ఒడిశాలో 1 నుంచి 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో దాదాపు 2,000 తప్పులు దొర్లడంపై ప్రభుత్వం పూర్తిగా గందరగోళంలో ఉందని బీజేడీ ఉపాధ్యక్షుడు ప్రసన్న ఆచార్య విమర్శించారు. పాత పుస్తకాలే కొనసాగుతాయని మంత్రి చెబితే, కొత్త పుస్తకాలు ఇస్తామని సీఎం, సెక్రటరీ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచిపోయిందని ఆచార్య గుర్తుచేశారు. ఇప్పుడు కొత్త పుస్తకాలు ముద్రించి ఇవ్వడానికి కనీసం 3-4 నెలల సమయం పడుతుందని చెప్పారు.
Comments
Loading comments...