వార్తలకు తిరిగి వెళ్లండి
కుభీర్ మండలం న్యూ సాంవ్లి గ్రామంలో రూ.12 లక్షలతో నిర్మించిన నూతన తరగతి గదులను ముధోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
గ్రామీణ ప్రాంతాల ఉజ్వల భవిష్యత్తుకు విద్యే మూలస్తంభమని, అందుకే పాఠశాలల్లో వసతుల పెంపునకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. త్వరలోనే గ్రామంలో వివో భవనం, గోదాంల నిర్మాణంతో పాటు మురికినీటి కాలువలు, సిమెంట్ రోడ్ల పనులను చేపడతామని వెల్లడించారు.
Comments
Loading comments...

