Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడు కిడ్నాప్‌ కేసులో మాజీ ఎమ్మెల్యేకు రిమాండ్ పొడిగింపు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 4:30 PM ఏలూరుGeneral
నూజివీడు కిడ్నాప్‌ కేసులో మాజీ ఎమ్మెల్యేకు రిమాండ్ పొడిగింపు - Udayam
నూజివీడు కిడ్నాప్‌ కేసులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌ రిమాండ్‌ను కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. జులై 27న జరిగిన ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారిని గత రిమాండ్‌, మూడు రోజుల పోలీస్‌ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మచిలీపట్నం ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ అనంతరం రిమాండ్‌ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Comments

G
Loading comments...