వార్తలకు తిరిగి వెళ్లండి

పీవోకే ఘర్షణలపై ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన కథనం వివాదాస్పదమైంది. ‘‘పాకిస్థాన్ కశ్మీర్’’ అనే పదాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది.
అది తప్పుదోవ పట్టించే శీర్షిక అని, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమని స్పష్టం చేసింది. ఆ ప్రాంతాలను పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించి అక్కడి ప్రజలపై హింసకు పాల్పడుతోందని ఎంబసీ మండిపడింది.
Comments
Loading comments...
