Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిండుకుండలా మారుతున్న కడెం ప్రాజెక్ట్

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 30, 2026 12:09 PM మంచిర్యాలతెలంగాణ
నిండుకుండలా మారుతున్న కడెం ప్రాజెక్ట్ - Udayam Digital
ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద రావడంతో కడెం ప్రాజెక్టు వేగంగా నిండుతోంది. గురువారం ఉదయం నీటిమట్టం 692 అడుగులకు చేరగా, పూర్తి సామర్థ్యం 700 అడుగులు. ప్రస్తుతం 23 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. వర్షాలు కొనసాగితే గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కడెం పరివాహక ప్రాంతాలతో పాటు గోదావరి నది వైపు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు.

Comments

G
Loading comments...