Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల కోసం ‘నిక-2 కిసాన్’ డ్రోన్

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 13, 2026 11:32 AM ఆల్ ఇండియా జాతీయ
రైతుల కోసం ఎకిన్ ఎనలిటిక్స్ సంస్థ 16 లీటర్ల సామర్థ్యం గల ‘నిక-2 కిసాన్’ డ్రోన్‌ను రూపొందించింది. మేక్ ఇన్ ఇండియా కింద అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ పంటలపై వ్యవసాయ ద్రావణాలను పిచికారీ చేయడానికి ఉపయోగపడుతుంది. రాత్రి వేళల్లోనూ పిచికారీ చేసేలా డ్రోన్‌ను రూపొందించినట్లు ఎకిన్ ఎనలిటిక్స్ సంస్థ తెలిపింది. దీంతో వ్యవసాయ పనులను మరింత సులభంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంది.

Comments

G
Loading comments...