Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో కొత్త సర్వే విలేజ్ డైరెక్టరీ

వివేక్ గౌడ్ Jul 18, 2026 10:24 AM అల్ ఇండియా about 2 hours ago
గ్రామాల్లో కొత్త సర్వే విలేజ్ డైరెక్టరీ - Udayam Digital
జనగణనలో భాగంగా ఇళ్ల లెక్కింపు పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా దేశవ్యాప్తంగా 'విలేజ్ డైరెక్టరీ' సర్వేకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని రవాణా, బ్యాంకింగ్, విద్యుత్, వైద్య సదుపాయాలు, భౌగోళిక పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిష్టాత్మక ప్రక్రియ ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 6 వరకు దేశవ్యాప్తంగా కొనసాగనుంది. అధికారులు క్షేత్రస్థాయిలో సేకరించే ఈ కీలక సమాచారాన్ని అధికారిక సెన్సస్ యాప్‌లో డిజిటల్‌గా భద్రపరుస్తారు.

Comments

G
Loading comments...