వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీలో కొత్తగా 10 బీసీ గురుకులాలు
దివ్య శ్రీ Jun 23, 2026 6:09 AM అమరావతి 2 viewsabout 2 hours ago

రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 10 బీసీ గురుకులాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందులో బాలురకు ఐదు, బాలికలకు ఐదు పాఠశాలలు అందుబాటులోకి వస్తాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధన సాగనుంది.
మొదటి సంవత్సరంలో ఒక్కో పాఠశాలలో 240 సీట్లు ఉండగా, 2027-28 నాటికి వాటిని 480కి పెంచుతారు. దీనివల్ల మొత్తం 4,800 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది.
Comments
Loading comments...