వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్వైజర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, గూడూరుకు చెందిన మద్దిలేటి అనే వ్యక్తి ఒక మహిళ నుంచి రూ. 1.60 లక్షలు వసూలు చేసి మోసగించాడు. ఉద్యోగం రాకపోగా, అడిగిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా సదరు వ్యక్తి బాధితురాలిని ఇబ్బందులకు గురిచేశాడు.
సోమవారం బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. మద్దిలేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె వేడుకోగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

