వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయ అవార్డు సాధించిన ‘కమిటీ కుర్రోళ్ళు’

నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా 72వ జాతీయ అవార్డుల్లో రెండు పురస్కారాలను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తంచేసింది.
తమ చిత్రానికి జాతీయ అవార్డు రావడంతో తన కల నెరవేరిందని నిర్మాత నిహారిక తెలిపారు. ఈ విజయంపట్ల మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతోషపడ్డారని ఆమె పేర్కొన్నారు. మొదటి నుంచీ ఈ సినిమాపై నమ్మకం ఉందని దర్శకుడు యదు వంశీ వెల్లడించారు.
Comments
Loading comments...