వార్తలకు తిరిగి వెళ్లండి
ఆళ్లపల్లిలో బురదమయమైన రహదారి
శరణ్య శర్మ Jun 24, 2026 6:27 AM భద్రాద్రి కొత్తగూడెం 8 viewsabout 18 hours ago

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో వర్షాలకు ప్రధాన రహదారి బురదమయంగా మారింది. బుధవారం ఎరువుల లారీ బురదలో చిక్కుకోవడంతో రాకపోకలు నిలిచిపోయి రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బురద వల్ల వెలువడుతున్న దుర్వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ రహదారిని వెంటనే బాగు చేయాలని స్థానిక ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...