వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రధాని మోదీ రేపటి పర్యటన విశేషాలు

ప్రధాని నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాలలో పర్యటించనున్నారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ఆయన ప్రారంభిస్తారు. అలాగే రూ.14,700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు.
చండీగఢ్లో రూ.6,600 కోట్ల వైద్య, విద్యా ప్రాజెక్టులను, పంజాబ్లోని జలంధర్లో రూ.5,470 కోట్ల కనెక్టివిటీ ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఇందులో అమృత్ భారత్ పథకం కింద పునర్నిర్మించిన 75 రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి.
Comments
Loading comments...