వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ20 పెట్రోల్తో మైలేజ్ తగ్గడం నిజమే: కేంద్ర మంత్రి

ఈ20 ఇంధనం వల్ల వాహనాల మైలేజ్ స్వల్పంగా తగ్గుతుందనే మాట నిజమేనని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అంగీకరించారు. అయితే మైలేజ్ తగ్గడానికి కేవలం ఇథనాల్ మాత్రమే కాకుండా ఇతర కారణాలు కూడా ఉండవచ్చన్నారు.
ఈ20 పెట్రోల్ వాడకం వల్ల పికప్, ఇంజిన్ నాకింగ్ మెరుగవుతాయని ఆయన తెలిపారు. దీనివల్ల వాహన బీమా రక్షణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, దీనిపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...