వార్తలకు తిరిగి వెళ్లండి

మెగాస్టార్ చిరంజీవితో తెలుగు చలనచిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్ల సమావేశం ముగిసింది. ఈ భేటీలో సురేష్ బాబు, దిల్ రాజు, కె.ఎల్. నారాయణ తదితరులు పాల్గొని, సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలు మరియు పర్సంటేజ్ విధానంపై దాదాపు గంటకు పైగా చర్చించారు. ఇండస్ట్రీలో ఎదురవుతున్న ఇబ్బందులను వారు చిరంజీవికి వివరించారు.
ఈ సందర్భంగా చిరంజీవి సానుకూలంగా స్పందిస్తూ, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రెండు మూడు రోజుల్లో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటిస్తామని సమావేశం అనంతరం నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.
Comments
Loading comments...

