వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం మిగులుగా తేలిన 4 వేల మందికిపైగా ఉపాధ్యాయులను క్లస్టర్ పాఠశాలలకు అనుసంధానించారు. అవసరాన్ని బట్టి వివిధ పాఠశాలల్లో బోధించాలని నిబంధన పెట్టారు. ఉపాధ్యాయులు సెలవు పెట్టినా, విద్యార్థుల సంఖ్య పెరిగినా క్లస్టర్ టీచర్లు అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. మారుమూల పాఠశాలల కోసం కొన్నిసార్లు 30-40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
Comments
Loading comments...

