వార్తలకు తిరిగి వెళ్లండి
దక్షిణ థాయ్లాండ్లో గోలోక్ ఎఫ్ఏ కప్-2026 సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో పిడుగు పడింది. ఈ ఘటనలో 24 ఏళ్ల ఫుట్బాల్ ఆటగాడు సోఫ్వాన్ మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు.
గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మ్యాచ్కు ముందు భారీ వర్షం కురిసిందని, వర్షం ఆగిన తర్వాత ఆట ప్రారంభించామని టోర్నీ నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...
